Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలపై కేసులు ఎత్తివేయడానికే 'ఆస్థానా'ను పట్టుకొచ్చారు
- ప్రభుత్వ వ్యవస్థల ప్రతిష్టను మంటగలిపారు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : సీబీఐలోకి ప్రధాని మోడీ స్వయంగా తెచ్చిపెట్టుకున్న మనిషి అవినీతి బాగోతంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. కీలకమైన ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో తమకు అనుకూలమైన వ్యక్తుల్ని మోడీ సర్కార్ నియమించుకుందని, తద్వారా పలు నేర, అవినీతి కేసుల్లో ఉన్న బీజేపీ నేతలకు క్లీన్చిట్ ఇప్పించుకున్నారని ఏచూరి అన్నారు. నేడు బయటపడ్డ సీబీఐ అవినీతి బాగోతం ఒక ఉదాహరణ మాత్రమేనేనని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని అన్నారు. సీబీఐ డైరెక్టరు, సహాయ డైరెక్టర్లపై వస్తున్న ఆరో పణలు, వారు చేసిన తతంగాలు బయటపడటంతో దేశవ్యా ప్తంగా ఇదొక సంచలనంగా మారింది. దీనిపై సీతారాం ఏచూరి మాట్లాడుతూ...''ప్రభుత్వ వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్ చొరబడింది. ఇలాంటి విధానాల్ని, రాజకీయ ఎత్తుగడల్ని ఓడించాలి. సీబీఐ తతంగం ఒక్కటి బయటపడింది. బయటపడనివి ఎన్నో ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపైన సీబీఐ తీవ్రమైన ఆరోపణలు నమోదుచేసింది. ఆ తర్వాత అవన్నీ ఎత్తేసింది. ఆయనకు క్లీన్చిట్ ఇచ్చేసింది. సీబీఐ ఇలా ఎందుకు చేసిందో మనమంతా ఊహించు కోవచ్చు'' అని అన్నారు.
రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి వాడుకున్నారు
''ఆస్థానాను ఉన్నత స్థానంలో నియమించి భాజపా నేతలపై ఉన్న కేసుల విచారణను జరగకుండా నిలుపుదల చేయాలన్నదే వారి ఉద్దేశం. ఇప్పుడు ఆయన (ఆస్థానా) రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు'' అని ఏచూరి ట్విట్టర్లో స్పందించారు. ప్రభుత్వ పాలనలో ప్రధాని మోడీ అసమర్థ తకు ఇది నిదర్శనమని అన్నారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి, దెబ్బతీయడానికి సీబీఐను వాడుకున్నారన్నది దీంతో బయటపడిందన్నారు. అర్హతలేని అధికారులెందరినో మోడీ ప్రభుత్వం ఉన్నతస్థానాల్లో కూర్చోబెట్టిందని, తద్వారా అత్యున్నత ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
''ఆస్థానాకు ఎవరు అండగా నిలుస్తున్నారు? సీబీఐ డైరెక్టర్ నుంచి వ్యతిరేకత ఉన్నా ఆయనను ఈ సంస్థలోకి ఎవరు ఎంపిక చేసి తీసుకొచ్చారు? దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి?'' అని సీతారాం ఏచూరి ప్రశ్నించారు.
మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషి కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అక్టోబరు 15న సీబీఐ సహాయ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదు చేసింది. గుజరాత్ క్యాడర్కు చెందిన ఆస్థానా 2002లో గోద్రా అల్లర్ల కేసు విచారణకు నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆయన వడోదర పరిధిలో ఐజీగా ఉన్నారు.