Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు రాంటెంకి శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గాంధీభవన్లో సిర్పుర్ కాంగ్రెస్ అభ్యర్థి హరీష్బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్రావు, సీనియర్ నేత భాస్కర్ సమక్షంలో చేరారు. ఆయకు కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దళితులు, గిరిజనుల సంక్షేమానికి పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. సిర్పుర్ తాజా మాజీ ఎమ్మెల్యే కొనేరు కొనప్ప దళితులపై దాడులు చేయించారని, ఎంతో మందిపై కేసులు నమోదు చేయించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.