Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ది హిందూ చైర్మన్ ఎన్.రామ్కు రాజా రాంమోహన్ రారు అవార్డు
జర్నలిజంలో విశేష సేవలు అందించినందుకు ప్రముఖ జర్నలిస్ట్, ది హిందూ పత్రిక చైర్మెన్ ఎన్.రామ్కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఘనంగా సన్మానించింది. రాజా రాంమోహన్ రావు ఏక్సిల్లెన్సీ అవార్డును అందుకున్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు తీసుకున్నారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మద్యమాల్లో ఎన్.రామ్కు అభినంనలు తెలిపారు.
నవతెలంగాణ-న్యూ ఢిల్లీ బ్యూరో
నవతెలంగాణ కార్టూన్ ఎడిటర్ పి.నరసింహా(నర్సిం)కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డుతో సత్కరించింది. నేషనల్ ప్రెస్డే సందర్భంగా ప్రతి సంవత్సరం జర్నలిజంలో అత్యుత్తమ సేవలను అందించిన వారికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా గుర్తించి అవార్డులిస్తుంది. అందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జాతీయ ప్రెస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా అవార్డుల జ్యూరీ కమిటీకి దేవులపల్లి అమర్ కన్వీనర్గా ఉన్నారు. అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా జైట్లీ ''డిజిటల్ యుగంలో పాత్రికేయుడి విలువలు-సవాళ్లు'' అనే పుస్తకాన్ని ఆవిష్కరించాక.. ఆయన మాట్లాడారు. ప్రజాస్వా మ్యంలో మీడియా పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యా నించారు. అయితే, ప్రస్తుతం మాత్రం మీడియా పక్షపాత వైఖరి అవలంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన ధోరణికి చరమగీతం పాడాల న్నారు. జర్నలిస్టులు విలువలతో పని చేయాలని సూచించారు. దేశ సమస్యలపై స్పందిస్తూ అవార్డులు గెలుచుకున్న వారిని ఆయన అభినందించారు. అనంతరం దేవులపల్లి అమర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికే యులపై దాడులు చేసిన వారిపై స్థానిక ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. చాలా మంది విలేకరులు సరైన వేతనాలు లేక ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమా వేశంలో పలు పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశం తర్వాత తెలుగు మీడియాతో నర్సిం మాట్లాడుతూ తన 35 సంవత్సరాల జర్నలిజం కెరీయర్లో అవార్డ్ రావడం అరుదైన విషయం అని చెప్పారు. ఇది తనకె ంతో స్ఫూర్తిదాయకమన్నారు.
కార్టూన్ జర్నలిజంలో లబ్దప్రతిష్టులైన ఆర్కె లక్ష్మణ్, అబూ అబ్రహం, మారియో మిరిండా, బాపుల నుంచి స్ఫూర్తి పొంది ఈ రంగంలోకి వచ్చినట్టు వివరించారు. తెలుగులో పొలిటికల్ కార్టూన్లకు కాలం చెల్లిందని అను కుంటు న్న తరుణంలో నవతెలంగా ణ పత్రిక పొలిటి కల్ కార్టూన్లకు పతాక స్థాయి కల్పించడం.. మొదటి పేజీ లోనే పొలిటి కల్ కార్టూన్ స్థానం కల్పిం చడం ఆనంద దాయకమన్నా రు. ఈ సంద ర్భంగా ఆయన పత్రిక యాజమా న్యం, ఎడిటర్కు కృత జ్ఞతలు తెలిపా రు.