Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాఖండ్ స్థానిక ఎన్నికల్లో...
- ఆచారాల్లో భాగమని సర్థిచెప్పుకున్న జోషి
డెహ్రాడూన్: 18న(ఆదివారం) ఉత్తరాఖండ్ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఒకరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా బహిరంగా డబ్బులు పంచుతున్నట్టు వీడియోలో రికార్డైంది. తన నియోజకవర్గంలోని ఛత్పూజ వేడుకల సందర్భంగా పాల్గొన్న గణేష్ జోషి అక్కడ ఉన్న మహిళలకు రూ.100 పంచుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ తన నుదిటిపై తిలకం దిద్దిన మహిళలకు మాత్రమే తాను డబ్బులు ఇచ్చానని అన్నారు. నుదిటిపై తిలకం దిద్దిన సోదరీమణులకు డబ్చులు ఇవ్వడం ఆచారాల్లో భాగమని జోషి సమర్థించుకున్నారు. కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఓటమి భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిం చినందుకు ఎన్నికల కమిషన్ నుంచి నోటీసు అందుకున్నట్టు వార్తలు ఖండించారు. తనకు ఎటువంటి నోటీసులు రాలేదని తెలిపారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు లిక్కర్ను పంచినప్పుడు లేని అభ్యంతరం, ఆచారాల్లో భాగంగా డబ్బును పంచితే ఆక్షేపణ చేస్తారాని ప్రత్యుత్తరం రాస్తానని అన్నారు. ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడం జోషికి కొత్తేమీకాదు, గతంలో పోలీసు గుర్రమైన శక్తిమాన్ను జోషి విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన గుర్రం అనంతరం చనిపోయిన విషయం విదితమే. అయితే ఆయన చర్య ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేదిగా ఉందంటూ జోషిపై రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. జోషిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ చీఫ్ ప్రీతం సింగ్ డిమాండ్ చేశారు.