Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్/సికార్ : రాజస్థాన్లోని సికార్ నియోజకవర్గం శుక్రవారం ఎర్రబారింది. వేలాదిమంది వెంటరాగా సీపీఐ(ఎం) అభ్యర్థి అమ్రరామ్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలోని దంతారామ్గఢ్ నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మాజీఎమ్మెల్యే కామ్రేడ్ పెమారామ్ ధోడ్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వేలాది మంది పాల్గొన్నారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు సలీం సభనుద్దేశించి ప్రసంగించారు. తారానగర్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి నిర్మల్ కుమార్ నామినేషన్దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో పొలిట్ బ్యూరో సభ్యులు సలీంతో సహా వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజస్థాన్లో డిసెంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పుడిప్పుడే జోరందుకుంది. ఈ ఎన్నికలలో రాష్ట్ర 15వ అసెంబ్లీకి 200 మంది సభ్యులను ప్రజలు ఎన్నుకోనున్నారు.