Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదిహేనేండ్ల నిరీక్షణకు తెర
- ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘోర పరాజయం
- ప్రభావం చూపని అజిత్ జోగి-మాయావతిల కూటమి
రారుపూర్: రెండు నెలల ఉత్కంఠకు తెర పడింది. పదిహేనేండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మరోసారి సీఎం పీఠంపై కన్నేసిన రమణ్సింగ్కు ఈసారి ఆశాభంగమే ఎదురైంది. గత రెండుసార్లు అధికారానికి దగ్గరగా వచ్చి విజయం ముంగిట బోల్తాపడిన కాంగ్రెస్ను ఈసారి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రంలో తొలిసారిగా ముక్కోణపు పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో.. ప్రభావం చూపిస్తుందని భావించిన అజిత్జోగీ-మాయావతిల కూటమి ఈ ఎన్నికల్లో తేలిపోయింది. పోలింగ్ ముగిసిన తరువాత హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేసినా.. హస్తం విజయధుంధుబి మోగించింది. 90 అసెంబ్లీ స్థానా లున్న రాష్ట్రంలో.. కాంగ్రెస్ 62 స్థానాల్లో గెలుపొం దింది. బీజేపీకి 16 స్థానాలు, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జేసీసీ)-బీఎస్పీల కూటమి 6 సీట్లు సాధించాయి. రాష్ట్రంలో మూడింట రెండు స్థానా లను కాంగ్రెస్ చేజిక్కించుకుంది. దీంతో, ఇన్నేండ్లు అధికారానికి దూరమై నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ విజయంతో రాష్ట్ర వ్యా ప్తంగా సంబురాలు చేసుకుంటున్నారు. రారుపూర్ లోని కాంగ్రెస్ కార్యాలయంలో సంబ రాలు మిన్నంటాయి.
అదిష్టానానిదే తుది నిర్ణయం-భూపేశ్ భఘాల్
'ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. బీజేపీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధా నాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో మేం మరింత బలపడ్డాం. రాష్ట్రంలో ప్రతీవ్యక్తిని కలిసి వారి సమస్యలను విన్నాం. ముఖ్యమంత్రి అభ్య ర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో అదిష్టానానిదే తుది నిర్ణయం' అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ భఘాల్ అన్నారు.
పూర్తి బాధ్యత నాదే- రమణ్ సింగ్
తాజా మాజీ ముఖ్య మంత్రి రమణ్ సింగ్ ఓటమిని అంగీకరిం చారు. రాష్ట్రంలో బీజేపీ ఓట మికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, ప్రతి పక్షంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పారు. ఇన్నేండ్లు తనను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం పనిచేసినా వారి రుణం తీర్చుకోలేనన్నారు. ఓటమిపై కూలంకషంగా చర్చింకుంటామని వివరించారు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదన్నారు.
సీఎం గెలుపు.. మంత్రులు ఓటమి
కాంగ్రెస్-బీజేపీలు పోటాపోటీగా తలపడిన ఈ ఎన్నికలలో పలువురు మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. రాజ్నందగావ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రమణ్సింగ్.. తన ప్రత్యర్థి, వాజ్పేయి మేనకోడలు కరుణ్ శుక్లాపై 7,763 ఓట్ల తేడాతో గెలుపొందారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉందనే కారణంగా ఎన్నికలకు ముందే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు బీజేపీ అధిష్టానం టికెట్లు నిరా కరించింది. కానీ, బిలాస్పూర్ నుంచి పోటీ చేసిన పట్టణాభివృద్ధి, కమర్షియల్ టాక్స్ శాఖ మంత్రి అమర్ అగర్వాల్.. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి శైలేశ్ పాండే చేతిలో 28,921 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో మంత్రి రాజేశ్ మునాత్ సైతం కాంగ్రెస్ అభ్యర్థి యోగేశ్ శర్మాలియా చేతిలో ఓటమి పాలయ్యారు.