Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాలు అనుసరించిన విధానాల పట్ల ప్రజల నుంచి వ్యక్త మవుతున్న అసంతృప్తి, ఆగ్రహానికి నిదర్శనమని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామన్న బీజేపీ ఆశల్ని ఈ ఫలితాలు పటాపంచ లు చేశాయని పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రభుత్వాలు ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా మత విభజన రాజకీయాలకు తెరతీశాయని పొలిట్బ్యూరో దుయ్యబట్టింది. ముస్లింలు, దళితులపై దాడులకు పాల్పడుతూ విద్వేషం, హింసను రగిలించేందుకు పన్నిన పన్నాగాలు ఫలించలేదని పొలిట్బ్యూరో తెలి పింది. తెలంగాణలో టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసినట్టు పొలిట్బ్యూరో పేర్కొన్నది. ఈ రాష్ట్రంలో బీజేపీకి గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు తగ్గాయని తెలిపింది. మిజోరంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఎంఎన్ఎఫ్ నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేసినట్టు పొలిట్బ్యూరో పేర్కొన్నది. బీజేపీ ప్రభుత్వాల స్థానంలో రాష్ట్రాలలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వాలు ప్రజాతీర్పునకు అనుగుణంగా విధా నాలను రూపొందిం చుకోవాలని పొలిట్బ్యూరో సూచించింది. ప్రజల కష్టాల్ని తగ్గించి వారి జీవనోపాధిని పెంచే లక్ష్యాలతో పని చేయాలని కోరింది. దేశ సమగ్ర తకు, ప్రజల మధ్య ఐక్యతకు నూతన ప్రభుత్వాలు హామీ ఇవ్వాలని పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. బీజేపీ అనుసరిం చిన మత విభజన రాజకీయాలను కొనసాగిస్తే మరింత నష్టం జరుగు తుందని హెచ్చ రించింది. ఈఎన్నికల బరిలో నిలిచిన తమ పార్టీ అభ్య ర్థులకు ఓట్లేసిన ప్రజలకు పొలిట్ బ్యూరో కృతజ్ఞతలు తెలిపింది. రాజ స్థాన్లోని శ్రీదుంగర్గఢ్, భాద్రా స్థానాల నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థుల ను గెలిపించిన ఆ రాష్ట్ర ప్రజలను పొలిట్బ్యూరో అభినందించింది