Authorization
Mon Jan 19, 2015 06:51 pm
31 వరకూ పొడిగింపు : సుప్రీం
న్యూఢిల్లీ : అసోంలోని జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ) ప్రక్రియపై అభ్యంతరాలు, ఫిర్యాదులు దాఖలు చేసుకునే తుది గడువును సుప్రీంకోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ నెల 15తో తుది గడువు ముగియనున్నది. ఎన్నార్సీపై దాఖలైన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించే ప్రక్రియ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుందని సుప్రీం తెలిపింది. ఈ ఏడాది జులై 30న ప్రచురించిన ఎన్నార్సీ తుది ముసాయిదాలో దాదాపు కొంత మంది ఎమ్మెల్యేలు, ఒక మాజీ ముఖ్యమంత్రితో సహా 40 లక్షల మంది పేర్లు తొలగింపబడ్డాయి. తొలగించబడిన వారందరూ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ పరిథిలోకి వస్తారు. వీరంతా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవలసి ఉంది.