Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లింలు ఆవును వధిస్తే నేరమా?
- ఢిల్లీ వర్సిటీ లాపేపర్లో వివాదాస్పద ప్రశ్న
- దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సిటీ లా పరీక్షలో వివాదాస్పద ప్రశ్న దొర్లింది. 'ఒక ముస్లిం.. హిందువుల ముందు ఆవును వధిస్తే నేరమా?' అంటూ లా ఆఫ్ క్రైమ్స్ పేపర్లో ప్రశ్నను అడిగారు. అయితే ఈ ప్రశ్నపై ఇప్పుడు వివాదం రేగడంతో ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నరేలాలోని చంద్ర ప్రభు జైన్(సీపీజే) కాలేజ్ ఆఫ్ లా.. ఈనెల 7న ఎల్ఎల్బీ విద్యార్థులకు పరీక్షను నిర్వహించింది. లా ఆఫ్ క్రైమ్స్ ప్రశ్న పత్రంలో భాగంగా..'ఒక ఆవును అహ్మద్ అనే వ్యక్తి రోహిత్, తుషార్, మానవ్, రాహుల్ల ముందు వధించాడు. అప్పుడు అహ్మద్ నేరం చేసినట్టా?' అని ఆ ప్రశ్న పత్రంలో అడిగారు. అయితే ఈ ప్రశ్నపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిలాల్ అన్వర్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో సామాజిక మాద్యమంలో ఇది వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ అంశంపై గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో బాధ్యులెవరో తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు తెలిపారు. మరోవైపు దీనిపై కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించిన ఢిల్లీ ప్రభుత్వం.. పది రోజుల్లో నిదేదికను అందించాలని ఆదేశించింది.