Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
న్యాయ శాఖకు సంబంధించిన ప్రతి నియామకం కార్యనిర్వాహక విభాగం, జ్యుడీషరీ డిపార్టుమెంట్ సంయుక్తంగా చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణకు చెందిన లోక్సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగిన లిఖి తపూర్వక ప్రశ్నకు మంత్రి బుధవారం సభకు సమాధానమిచ్చారు. న్యాయ శాఖకు సంబంధించిన నియామకాలు ఆలస్యం అవుతుందని తమ ప్రభు త్వం ఆ విభాగాన్ని నిందించడం లేదని ప్రశ్నలో భాగంగా ఆయన వెల్లడిం చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులలో పెండింగ్లో ఉన్న నియామ కాలపై పైన పేర్కొన్న రెండు విభాగాలు సంయుక్తంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందువల్లే న్యాయ శాఖ నియామకాలు చేపట్టడంలో ఆలస్యం ఏర్పడుతుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సాంప్రదాయాల కారణంగా నియామకాలకు అందరి అనుమతి తీసుకొని చేపట్టాల్సి ఉంటుందన్నారు.