Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకిస్తున్న హిందూత్వ సంస్థలు
బెంగళూరు : బెంగుళూరు నగరంలోని సర్కిల్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలన్న బృహత్ బెంగుళూరు మహానగర పాలికే సంస్థ నిర్ణయంపై హిందూ జాగరణ వేదిక సభ్యులు, బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. టిప్పు సుల్తాన్ చాలామంది మరణాలకు బాధ్యుడనీ బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ విమర్శించారు. బెంగుళూర్ సర్కిల్కు అతని పేరు పెట్టడం సరికాదన్నారు. బెంగుళూరులోని బెల్లహలి సర్కిల్ పేరును టిప్పు సర్కిల్గా మార్చాలన్న ప్రతిపాదనను కర్నాటక కాంగ్రెస్ నాయకుడు, న్యాయ శాఖ మంత్రి క్రిష్ణ బైరీ గౌడ ముందుకుతెచ్చారు. దీన్ని హిందుత్వ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్నారాయణ మాట్లాడుతూ... సర్కిల్కు టిప్పు పేరును పెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నదనీ ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైన ఇటువంటి చర్యలను మానుకోవాలనీ, ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని సూచించారు.