Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానిగా యోగి కావాలి
- అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో లక్నోలో వెలిసిన పోస్టర్
లక్నో: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు, పార్టీ శ్రేణు లు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అధినాయకత్వం, పార్టీ వ్యూహంపై బీజేపీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్లో మాత్రం ఈ నిరాశ కాస్తా అధినాయకత్వంపై వ్యతిరేకత గా మార్పు చెందింది. ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. మోడీ అబ ద్ధాలకోరు.. వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా యోగి ఆదిత్యానాథ్ను ఎన్ను కోవాలని రాసిఉన్న ఓ పోస్టర్ యూపీలోని లక్నోలో వెలిసింది. యోగి లావో.. దేశ్ బచావో(యోగిని తీసుకురండి.. దేశాన్ని కాపాడండి) అని పేర్కొన్న ఈ పోస్టర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 'హ్యాష్ ట్యాగ్ యోగి ఫర్ పీఎం' అని రాసి ఉన్న ఈ పోస్టర్ను నవనిర్మాణ్ సేన ప్రదర్శించింది. 'బూటకపు హామీలనిచ్చే మోడీ వర్సెస్ హిందూత్వ బ్రాండ్ యోగి' అని ఉన్న ఈ పోస్టర్ సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో పోలీసులు దాన్ని తొలగించారు. అనంతరం నవనిర్మాణ్ సేన చీఫ్ అమిత్ జానిపైనా పరువునష్టం, పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశంపై జాని ఆరు నిముషాలు మా ట్లాడిన వీడియోకూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మూక దాడుల్లో ముస్లింలను హతమార్చిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి లోక్సభ ఎన్నికల కోసం నవనిర్మాణ్ టికెట్లనిచ్చి జాని ఇటీవలే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీలో చీలికలు ఏర్పడుతున్నాయా? అనే విషయంపై విశ్లేషకులు చర్చిస్తున్నారు.