Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవు తున్నది. ఈ నెల 19న శ్రీహరికోటలోని సతీశ్ధ వన్ స్పేస్ సెంటర్ నుంచి జీశాట్-7ఏ ఉపగ్ర హాన్ని నింగిలోకి పంపించనున్నట్టు ఇస్రో బుధవా రం వెల్లడించింది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్ఎల్వీ)-మార్క్2 రాకెట్ ఈ సమాచార ఉపగ్రహాన్ని మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. జీఎస్ ఎల్వీ సిరీస్లో ఇది 13వ ప్రయోగ మని, జీశాట్-7ఏ 35వ భారత సమాచార ఉపగ్రహమని ఇస్రో తెలిపిం ది. అంతేకాక.. 2,250 కిలోల బరువున్న జీశాట్-7ఏ.. ఆంటేనాలోని కేయూ బ్యాండ్ల సమాచారానికి సంబంధించి ఎనిమిదేండ్ల పాటు సేవలు అందిచనున్నది.