Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కోస్తాంధ్ర తీరానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం నుంచి 16 వరకు కోస్తా జిల్లాలపై చూపొచ్చని వాతావరణ శాఖ చేసిన సూచనల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైతుల పంటలకు సంబంధించి కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు తాజా సమాచారం చేరవేస్తూ వాళ్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశమున్నదని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.