Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ వ్యాఖ్యలపై చంద్రబాబు
ఒంగోలు : ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు.. రావచ్చునని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు వ్యాఖ్యానిం చారు. ఒంగోలులో బుధవారం జరిగిన జ్ఞానభేరీ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని.. అక్కడి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్కు వచ్చి తనకేదో గిఫ్ట్ ఇస్తానంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి..రావొచ్చని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి కోసమే టీడీపీని ఎన్టీఆర్ నెలకొల్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరు అటూ ఇటూ లాలూచీ పడొచ్చేమోగానీ.. తాము మాత్రం తెలుగువారు ఎక్కడ ఉన్నా పనిచేశామని తెలిపారు. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి బరిలో దిగిన చంద్రబాబుకు ఏపీ వెళ్లి 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తామని మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం కెేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.