Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కారెం శివాజీ, వర్ల రామయ్యల
అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు జస్టిస్ పున్నయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. విజయవాడ ఆర్టీసి కాంప్లెక్స్ ఎస్సీఎస్టీ కమిషన్ కార్యాలయంలో బుధవారం జస్టిస్ పున్నయ్య సంతాప సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ జిల్లా, హైకోర్టు జడ్జీగా పనిచేసిన పున్నయ్య ఎన్నో విప్లవాత్మకమైన తీర్పులిచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అనుకూలమనే విషయాన్ని తన తీర్పులతో సమాజానికి తెలియజేశారన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న అంటరానితనం, వివక్షను రూపు మాపేందుకు జస్టిస్ పున్నయ్య ఆధ్వర్యంలో ఒన్మేన్ కమిషన్ను ఏర్పాటు చేశారన్నారు. అప్పటి 23 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన సామాజిక రుగ్మతలపై 42 సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించా రన్నారు. 42 సిఫార సులను అప్పటి రాస్ట్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. అందులో భాగంగానే 2003లో ఎస్సీ,ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేసి దానికి జస్టిస్ పున్నయ్యను చైర్మన్గా నియమించిం దన్నారు. ఆయన హయాంలో అగ్రవర్ణ ఛాందసులు ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులు పెట్టడానికి భయపడే వారన్నారు. జస్టిస్ పున్నయ్య మృతి దళిత, గిరిజన, బహుజనులకు తీరని లోటని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. పున్నయ్య ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం లోనూ, తీర్పులివ్వడంలోనూ పున్నయ్య ఎంతో విజ్ఞతతో వ్యవహరించే వారని కమిషన్ ఓఎస్డి సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా పున్నయ్య చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.