Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతను అంబానీ కాదు... మరి ఎవరు?
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఓ వ్యక్తి కనీవినీ ఎరుగని రీతిలో నైట్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.52 కోట్లు ఖర్చు పెట్టాడు. మోడీ కోసం ఇంత భారీమొత్తంలో ఖర్చు పెట్టాడంటే కుబేరుడు ముకేశ్ అంబానీనే ముందుగా గుర్తొస్తారు. కానీ, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మోడీ కోసం కోట్ల రూపాయల ఖర్చుకు వెనుకకాడని సదరు వ్యక్తి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కావడం గమనార్హం. మోడీ పుట్టినరోజు సందర్భంగా మాల్దీవుల్లో బిన్ సల్మాన్ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ వేడుకకు హాలీవుడ్ స్టార్లనూ సల్మాన్ ఆహ్వానించారు. అంతేకాదు.. పాప్ సింగర్ పిట్బల్, కొరియన్ స్టార్ పీఎస్వై, జే-లో, షకీరా, జెన్సీఫర్ లోఫెజ్, తదితర ఫేమస్ సెలబ్రిటీలనూ రప్పించారు. ఒక్క రాత్రి జరిగిన ఈ వేడుకకు అయిన ఖర్చు అక్షరాల రూ.52 కోట్లు. మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం సౌదీ అరేబియా ఉప ప్రధానిగా పని చేస్తున్నారు. అంతేకాక రక్షణ మంత్రిత్వశాఖ బాధ్యతలను సైతం చూసుకుంటున్నారు. ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ఇటీవల దారుణ హత్యకు గురైన కేసులో సల్మాన్ పేరు కూడా వెలుగుచూసిన సంగతి తెలిసిందే.