Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ఫలితాలపై యశ్వంత్ సిన్హా
- బీజేపీని ఓడించేందుకు రెండు ప్రత్యామ్నాయమార్గాలు
కోల్కతా: హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల ఫలితాలు 'మోడీ మ్యాజిక్ థియరీ'కి బ్రేకులు వేశాయని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. బీజేపీ ఓటమి.. 2019 సార్వత్రిక ఎన్నికలకు కూటమి కట్టేందుకు విపక్షాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందనీ తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారాన్ని కోల్పోగా, మిజోరం, తెలంగాణలో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీపై ఘాటు విమర్శలు చేసే యశ్వంత్ సిన్హా బుధవారం అసెంబ్లీ ఫలితాలపై మాట్లాడారు. మోడీని విమర్శిస్తూనే ఒక అడుగు ముందుకు వేసి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాలనూ సూచించారు. ఎన్నికలకు ముందే పార్ల మెంటు నియోజకవర్గ స్థాయిలో పోరాడేలా కాంగ్రెస్తో సహా విపక్షపార్టీలన్నీ కూటమిగా ఏర్పడాలని సూచిం చారు. మొదటిది సాధ్యం కాకుంటే ప్రాంతీయ పార్టీలే ఫ్రంట్గాఏర్పడి అవసరమైన స్థానాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని అన్నారు. నరేంద్రమోడీని గద్దెదించాలని భావిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమి.. ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని కమలం పార్టీ ఎద్దేవా చేయడంపైనా ఆయన స్పందించారు. 'ప్రధాని కాకముందు మోడీ ఎవరు? ఆయన ఒక సీఎం. విపక్షాల్లోనూ సీఎంలు, మాజీ మంత్రులూన్నారు. నాయకులకు కొదవలేద'ని అన్నారు. రెండోసారి మోడీ సర్కారు అధికారంలోకి వస్తే.. దేశంలో ఎక్కడా ప్రజాస్వామిక ఆనవాళ్లు లేకుండా పోతాయని అభిప్రాయపడ్డారు.