Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ స్థానాల్ని ఇచ్చిన హిందీ రాష్ట్రాల్లో చేదు ఫలితం
- అసోం, త్రిపుర వచ్చాయనుకుంటే...రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ చేజారే. -2019 సార్వత్రిక ఎన్నికల తీర్పుపైనా ప్రభావం
అసోం, త్రిపుర వంటి రాష్ట్రాల్లోనే జెండా ఎగురవేశాం, మాకు తిరుగులేదు...అని చెప్పుకున్న మోడీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభలో అత్యంత బలాన్నిచ్చిన హిందీ రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ బీజేపీ నుంచి చేజారిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ క్షేత్రబలాన్ని పోగొట్టుకున్నది. మంగళవారంనాటి ఫలితాలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
న్యూఢిల్లీ : 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 'కాషాయ పార్టీ' ఎజెండా ఎగురవేయడమే మోడీ సర్కార్ లక్ష్యం...అని ఎగిరిపడిన బీజేపీ నాయకులకు మంగళవారం నాటి ఎన్నికల తీర్పు మింగుడుపడటం లేదు. రేపటి ఎన్నికలపై బెంగపట్టుకుంది. దేశంలో మోడీ మానియాకు తొలిసారిగా ఓటర్లు అడ్డుకట్ట వేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్...హిందీ బెల్ట్కు గుండెకాయ లాంటివి. ఇక్కడ ప్రజలనాడి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నదని ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. హిందీ రాష్ట్రాల్లో ఓటరు ఇచ్చిన తీర్పు నేడు దేశాన్ని ఆలోచింపజేస్తోంది. దశాబ్దాలుగా బీజేపీ అధికారాన్ని చూసి, నాలుగున్నరేండ్ల మోడీ పాలనచూసి...ఇచ్చిన ఎన్నికల తీర్పు దేనికి సంకేతం? అన్నది బీజేపీ జాతీయ నాయకుల్లో గుబులురేపుతోంది. మతం అనే మత్తుమందుతో ఏర్పరచుకున్న హిందూ ఓటుబ్యాంక్పై పట్టు సడులుతోందని గ్రహిస్తున్నారు. అందుకే దానిని మరోరకంగా రగిలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఆ ఏడింటిలో మూడు పాయే..
19 రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ స్వంత బలంతో ప్రభుత్వాలు ఏర్పాటుచేయగల్గింది. మిగిలిన 12రాష్ట్రాల్లో ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాల్ని ఏర్పాటుచేశారు. డిసెంబరు 11 ఎన్నికల తీర్పుతో కీలకమైన మూడు రాష్ట్రాలు చేజారిపోయాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో అధికార బీజేపీ, మోడీ నాయకత్వాన్ని నాలుగేండ్లు చూసి మరీ కాంగ్రెస్కు ఓట్లు వేశారు. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అంతగా పుంజుకో కపోవటం బీజేపీకి కలిసివచ్చింది. ఈ రాష్ట్రా ల్లో ప్రత్యామ్నాయ నాయ కత్వం ఉంటేగనుక కథ వేరే విధంగా ఉండేది.
ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల తీర్పు 2019లో బీజేపీ గెలుపు అవకాశాల్ని చూచాయిగా చెప్పినట్టే. మూడు రాష్ట్రాల నుంచి 65 లోక్సభ స్థానాలు న్నాయి. ఇందులో అత్యధికం బీజేపీవే ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ 65 లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపు అంత సులభం కాదన్నది తేలిపోయింది. ఛత్తీస్గఢ్ తీసుకుంటే, ఇక్కడ 15సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉన్నది. ఈసారి కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందన్న మాట ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఎన్నికల తీర్పు కూడా అలాగే ఉన్నది. రాజస్థాన్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 25 లోక్సభ స్థానాల్ని మోడీ నాయకత్వంలోని బీజేపీ గెలుచు కోగలిగింది. ఇప్పుడా పరిస్థితి లేదు. మోడీ మేనియాకు ఫుల్స్టాప్ పడిపోయింది. నిజానికి కాంగ్రెస్ అనుకున్నంతగా పుంజుకోలేదు. ప్రజల ఆకాంక్షలకు, అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేసి ఉంటే, వసుంధర రాజే సర్కార్కు ఆ 73స్థానాలు కూడా వచ్చేవి కాదని సమాచారం.
తెలంగాణ ఫలితం సంతోషాన్నిచ్చిందా?
మోడీ సర్కార్కు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు మొదట్నుంచీ గట్టి మద్దతుదారు టీఆర్ఎస్, ఆ పార్టీని నడుపుతున్న కేసీఆర్. ఇక్కడ కేవలం అస్తిత్వాన్ని కాపాడుకోవటమే బీజేపీ ప్రధాన లక్ష్యం. అందులోనూ విఫల మైంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ కూటమికి గెలుపు దక్కలేదు. కేసీఆర్ గెలిచాడు. ఈ ఫలితం మోడీ సర్కార్కు సంతోషపెట్టిందన్న మాటలు వినపడ్డాయి. రాహుల్ గాంధీకి, మిజోరాం, తెలంగాణాల్లో దక్కిన ఫలితాలు బీజేపీ శ్రేణుల్ని కాస్త ఊరడించాయి.
హిందూ ఓటుబ్యాంక్ పనిచేయదా?
మిజోరాంలో కాంగ్రెస్ పాలనకు ఫుల్స్టాప్ పెట్టి, 'మిజో నేషనల్ ఫ్రంట్'కు ఓటేశారు. బౌద్ధులు ఎక్కువగా ఉన్న ఒక్క నియోజకవర్గాన్ని బీజేపీ దక్కించుకున్నది. మధ్యప్రదేశ్ మొదట్నుంచీ బీజేపీకి బలమైన రాష్ట్రం. ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్, వీహెచ్పీ నాయకులకు ప్రధానకేంద్రం ఈ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి ఫలితం వస్తుందని బీజేపీ ఊహించలేదేమో! స్వల్ప ఆధిక్యతతో అధికారంలోకి వ స్తామని బీజేపీ నాయకులు లెక్కలు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి విశ్వాసంతో పనిచేయలేదు. యోగి, మోడీతోపాటు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హిందూ ఓట్బ్యాంక్ను నమ్ముకున్నా రేగానీ, తమ పాలనను నమ్ముకోలేదు. రైతుల్ని నిర్లక్ష్యం చేశా రు. వ్యవసాయ సంక్షో భాన్ని తేలిగ్గాచూశారు. దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అడ్డుకోలేదు. నిరు ద్యోగ యువతకు ఉపాధి మార్గాల్ని చూపెట్టలేదు. మూడు హిందీ రాష్ట్రాల్లోని హిందు వుల్ని ప్రభావితం చేయడానికి అయోధ్యలో ఉద్యమాల్ని, ఉద్రిక్తతను తెచ్చిపెట్టారు. ఆర్ఎస్ ఎస్, భజరంగ్దళ్, శివసేన, వీహెచ్పీలను రంగంలోకి దింపి 'అయోధ్య' అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వేసిన ఈ ఎత్తుగడ మధ్యప్రదేశ్లో అంతగా పారలేదు. మతంతో మెజార్టీ హిందువుల్ని ప్రభావితం చేయలేమన్న విషయం బీజేపీని ఆందోళనకు గురిచేస్తోంది.