Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వీడని ఉత్కంఠ
- హైకమాండ్ నిర్ణయానికే వదిలేసిన ఎమ్మెల్యేలు
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో వీడని ఉత్కంఠ
- హైకమాండ్ నిర్ణయానికే వదిలేసిన ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ : ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్కు ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సుగమమైంది. కానీ, ముఖ్యమంత్రి పదవులు ఎవర్ని వరిస్తాయనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో సీఎం రేసులో ఇద్దరేసి చొప్పున ఉండగా.. ఛత్తీస్గఢ్లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. రేసులో ఎవరున్నప్పటికీ ముఖ్యమంత్రుల ఎంపికపై పార్టీ అధినేత రాహుల్గాంధీ నిర్ణయమే ఫైనల్ కానున్నది.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కడదాకా దోబూచులాడినప్పటికీ.. అంతిమంగా కాంగ్రెస్కే అత్యధిక స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ 114 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్కు 2 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం ఉదయం స్పష్టం చేశారు. ఆ పార్టీకి మధ్యప్రదేశ్లో 2, రాజస్థాన్లో 6 స్థానాలు దక్కాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ కమల్నాథ్, పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ జ్యోతిరాదిత్య సింథియా, పలువురు పార్టీ నేతలు బుధవారం మధ్యాహ్నం గవర్నర్ ఆనందీబెన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. కమల్నాథ్, జ్యోతిరాధిత్య సింథియాలో ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. కాగా.. ముఖ్యమంత్రి పదవిస్తే ఆనందంగా స్వీకరిస్తానని, బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని సింథియా.. మీడియాకు తెలిపారు. కానీ, రాష్ట్రంలో బీజేపీకి కూడా ఎక్కువ స్థానాలు(109) దక్కినందున భవిష్యత్తులో ఇరకాటంలో పడకుండా ఉండేందుకు సీనియర్ను సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే సీనియర్ అయిన కమల్నాథ్కే ఎక్కువ అవకాశాలు న్నాయి. కాగా.. ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్గాంధీకి అప్ప గిస్తూ బుధవారంనాటి ఆ పార్టీ శాసనసభాపక్ష సమా వేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ఓటమికి తనదే బాధ్యత అని, సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు శివరాజ్సింగ్ చౌహాన్ బుధవారం ప్రకటించారు.
అటు రాజస్థాన్లోనూ సీఎం ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడలేదు. కాంగ్రెస్ కూటమి 100 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్కు ఒక స్థానం దూరంలో నిలిచింది. కానీ, బీఎస్పీ మద్దతు ప్రకటించడం, కాంగ్రెస్ రెబెల్స్ తిరిగి సొంతగూటికి చేరేందుకు మొగ్గు చూపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవాంతరాలేమీ లేవు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్, యువనేత సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్లు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకునేలా చేయడంలో సచిన్పైలట్ విశేషంగా కృషి చేశారు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా సీఎం పదవికి అర్హుడినేనన్న సంకేతాలు పంపారు. కానీ, అనుభవం ఉన్న వారికే అవకాశమివ్వాలని భావిస్తే రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన గెహ్లాట్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపే అవకాశమున్నది.
గిరిసీమలో పదిహేనేండ్ల తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. రేసులో పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ బఘేలాతో పాటు గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టి.ఎస్.సింగ్ దేవ్, ఓబీసీ నేత తమ్రద్వాజ్ సాహూ, లోక్సభ ఎంపీ చరణ్దాస్ మహంత్ పోటీ పడుతున్నారు. భూపేశ్ బఘేలా.. ఛత్తీస్గఢ్లో పార్టీకి పెద్దన్నగా వ్యవహరి స్తున్నారు. 2014లో మోడీ ఛరిష్మాను తట్టుకుని రాష్ట్రం నుంచి గెలిచిన ఏకైక ఎంపీ చరణ్దాస్తో పాటు పార్టీలోని కీలక నేతలు తమ్రద్వాజ్ సాహూ, టి.ఎస్.సింగ్లు కూడా సీఎం రేసులో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి ఏడుగురు ముస్లింల గెలుపు
జైపూర్ : రాజస్థాన్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థుల్లో ఏడుగురు గెలుపొం దారు. ఈ ఎన్నికల్లో 15 మంది ముస్లిం అభ్యర్థుల ను ఆ పార్టీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం యూనస్ఖాన్ ఒక్కరికే టిక్కెట్ ఇచ్చింది. ఆయనను కాంగ్రెస్లో కీలక పాత్ర పోషి స్తున్న సచిన్ పైలట్పై పోటీగా దింపింది. కాగా.. యూనస్ఖాన్పై పైలట్ తిరుగులేని విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలువక పోగా.. ఈసారి ఏకంగా ఏడుగురు విజయం సాధించడం గమనార్హం.
మూడు రాష్ట్రాల్లో 41మంది మంత్రులు ఔట్
రాజస్థాన్లో 22 మంది మినిస్టర్లు ఇంటిదారి..
జైపూర్: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో 41 బీజేపీ మంత్రుల స్థానాలూ గల్లంతయ్యాయి. మధ్యప్రదేశ్లో 13 మంది మంత్రులు, రాజస్థాన్లో 20 మంది, ఛత్తీస్గఢ్లో ఎనిమిది మంది మినిస్టర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఛత్తీస్గఢ్లో సీఎం సహా నలుగురు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వ వ్యతిరేకతతో 13 మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ 10 మంది మంత్రులు తమ స్థానాలను కాపాడుకోలేకపోవడం గమనార్హం. కాగా, బీజేపీ నేత విజరువర్గీరు మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులు సరిగ్గా జరగలేదని, కొందరు అభ్యర్థులపై పార్టీ నేతల్లోనూ వ్యతిరేకత ఉన్నదని అన్నారు. అందుకే '200 స్థానాల్లో గెలుపు' అనే నినాదాన్ని 'నాలుగోసారి శివరాజ్సింగ్' అని మార్చినట్టు తెలిపారు. రాజస్థాన్ మంత్రుల్లో సగం మంది మంత్రులు కూడా విజయాన్ని సాధించలేకపోయారు. వసుంధర సహా 30 మంది మంత్రుల్లో కేవలం ఎనిమిది మంది మినిస్టర్లు మాత్రమే తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇందులో ఇద్దరు మంత్రులు తమ వారసులకు టికెట్లనిచ్చారు. మొత్తంగా 22మంది మంత్రులు ఇంటిదారి పట్టారు. కాగా, గెలిచిన ఎనిమిది మందిలో నలుగురు మంత్రులకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా విజయం సాధించడం గమనార్హం.
రమణ్సింగ్ రాజీనామా
ఛత్తీస్గఢ్లో ఓటమికి బాధ్యత వహిస్తూ..
రారుపూర్: అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపించారు. మంగళవారం వెలువడిన ఫలితాలలో పదిహేనేండ్ల బీజేపీ పాలనకు తెరదించుతూ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్కు 68 స్థానాలు రాగా, బీజేపీకి 15, అజిత్ జోగి జేసీసీకి 5, బీఎస్పీ 2 స్థానాలు గెలుపొందాయి. కాగా, ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ రమణ్సింగ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని తెలిపారు.