Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవంబర్ వరకు భారత్లో
- 15వేలకు పైగా వెబ్సైట్లు హ్యాకింగ్
- మూడేండ్లలో సుమారు 70వేలకు మించి దాడులు : కేంద్రఐటీశాఖమంత్రి వెల్లడి
- ప్రతి ఏటా ఆర్థిక వ్యవస్థకు నష్టం 74కోట్లు : మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: ఈ నవంబరు వరకు 15వేలకు పైగా భారతీయ వెబ్సైట్లు హ్యాకింగ్కు గురైనట్టు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్సభకు రాతపూర్వక సమాధానంగా తెలియజేశారు. 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ-ఇన్) ఇచ్చిన నివేదిక ప్రకారం 2016లో 33,147, 2017లో 30,067, 2018(నవంబరు వరకు) 15,779 భారతీయ వెబ్సైట్లు హ్యాకింగ్కు గురయ్యాయి' అని ఆయన చెప్పారు. సైబర్ దాడులు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. సైబర్ క్రైమ్ కేసులు ఎన్ని నమోదయ్యాయి అనే మరో ప్రశ్నకు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి అహ్లువాలియా సమాధానం ఇచ్చారు. జాతీయ నేర విభాగం అందజేసిన సమాచారం ప్రకారం 2014లో 9622, 2015లో 11,592, 2016లో 12,317 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇచ్చిన నివేదిక ప్రకారం 2015-16లో 1,191, 2016-17లో 1,372, 2017-18లో 2,059, 2018-19(సెప్టెంబరు 30 వరకు) 921 కేసులు డెబిట్కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు జరిగినట్టు తెలిపారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్నాయని కేంద్రమంత్రులు అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ సంస్థలకు వెబ్సైట్లలోనూ హ్యాకర్లు సైబర్దాడులకు పాల్పడుతుండ టం గమనార్హం. ఇదిలా ఉండగా సైబర్దాడుల వల్ల ప్రతి ఏటా ఆర్థిక నష్టం 74 కోట్ల మేర ఉంటుందని మైక్రో సాఫ్ట్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రప్రభుత్వం సరైన దిశగా సైబర్ దాడులను అడ్డుకోవటంలో విఫలమవటంవల్లే...ఖజానాకు చేరాల్సిన సంపద కాస్త అడ్డదారిలోకి వెళ్లిపోతున్నదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.