Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లలో 28వేలమంది భారతీయుల మృతి
- కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: ఉపాధికోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయుల గోస కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలకు అస్సలు పట్టడంలేదని వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలకోసమని వెళ్లి..అక్కడ జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి ఆందోళన ఎక్కువవుతున్నది. తెలంగాణ నుంచి పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ కెళ్లిన వారి ఆచూకీ దొరకటంలేదు. కనీసం వారు బతికి ఉన్నారా..లేదా అన్న సమాచారం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్న ఘటనలెన్నో. తాజాగా మోడీ సర్కార్ హయాం..అంటే నాలుగేండ్లలో 28,523మంది మంది మృతి చెందారని లోక్సభ రిబుధవారం వెల్లడించింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన భారతీయుల మరణాలు గత నాలుగేండ్లలో గణనీయంగా పెరిగాయని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమా ధానం ఇచ్చారు. కేంద్రమంత్రి ఇచ్చిన వివరాల ప్రకారం.. 2014-18 సంవత్సరాల్లో బహ్రెయిన్లో 1,021మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. కువైట్లో 2,932మంది, ఒమన్లో 2,564మంది చనిపోయారు. ఖతార్లో 1.301మంది భారతీయులు చనిపోయారు. అత్యధికంగా యూఏఈలో 7,877మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో అత్యధికంగా 6,013 మంది భారతీయులు చనిపోగా, 2017లో 5,906మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా వీరిలో రోడ్డు ప్రమాదం, ఆత్మహత్యలు కారణంగా చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నట్టు కేంద్రప్రభుత్వం గుర్తించింది. గల్ఫ్ వెళ్లాక తమ ఆర్థిక పరమైన బాధలు దూరమవుతాయనుకుంటే.. అక్కడ ఎదురయ్యే కష్టాలు దిగమింగుకోలేక ఆత్మహత్యలు చేసుకుం టున్నారని సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఇలాంటి మరణాలు నివారిం చేందుకు భారత ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 'ప్రవాసీ భారతీయ కేంద్ర' ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అయితే ఇవి ఎంతవరకు గల్ఫ్ మరణాలను అడ్డుకుంటున్నాయో.. తెలియజే యటానికి సరైన వివరాల్లేవని తెలిసింది.