Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీసీ వేయాలి : ప్రతిపక్షపార్టీల డిమాండ్
న్యూఢిల్లీ : రాఫెల్ కుంభకోణం తేల్చాల్సిందేనం టూ పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. రాఫె ల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనలతో ఉభయ సభలూ వాయిదాల పర్వంలో నడిచాయి. పార్లమెంట్ ఉభయసభల్లోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి మరీ ఆందోళన చేశారు. వారి వారి డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ,ప్లకార్డులు చేతపట్టుకుని నిరసనకు దిగారు. దీంతో పార్లమెం టు సమావేశాలు స్తంభించాయి. రాఫెల్ కుంభ కోణం, ఆర్బీఐ, సీబీఐ, నోట్లరద్దు, కావేరీ జల వివా దం, రామ మందిర నిర్మాణం, ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలు కుదిపేశాయి. లోక్సభ సమా వేశాలను ప్రారంభించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ, శివసేన, అన్నాడీఎంకే ఎంపీలు ఆం దోళనలకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలం టూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. సరాసరి వెల్లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియం ఎదుట ఆందోళన చేశారు. సీపీఐ(ఎం), ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జే డి సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలి పారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ మళ్లీ ప్రారం భమైంది. కాంగ్రెస్ ఎంపీ సునీల్ కుమార్ జఖర్, సీపీఐ(ఎం) లోక్సభ పక్ష ఉపనేత ఎండీ సలీం రాఫె ల్ ఒప్పందంపైన, ఆర్జేడి నేత జయప్రకాశ్ యాదవ్ సీబీఐ సంక్షోభంపైన, కాంగ్రెస్ నేత రంజత్ రంజన్ ఆర్బీఐ, పెద్దనోట్ల రద్దుపైన, శివసేన ఎంపీ చంద్ర కాంత్ కైరే రామమందిర్ అంశంపైన ఇచ్చిన తీర్మా నాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. కాగా, ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించ డంతో స్పీకర్ సుమిత్రా మహజన్ సభను గురువారా నికి వాయిదా వేశారు. అంతకుముందు... కర్నాటక లోని బళ్లారిలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేత ఉగ్రప్ప, మండ్య నుంచి జేడీఎస్ నేత శివరామగౌడ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్యసభలో..
రాజ్యసభలోని కూడా వాయిదాల పర్వమే కొన సాగింది. రాఫెల్ కుంభకోణంపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో అట్టుడికిన రాజ్యసభ పలుసార్లు వాయి దా పడింది. మధ్యాహ్నం మూడు గంటల సమయం లో రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సభను గురువారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే చైర్మెన్ జీరో అవర్ను ప్రారంభించేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసు కెళ్లారు. సభ్యులు పోడియంను చుట్టిముట్టి నినాదా లతో హోరెత్తించారు. దీంతో సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన సభలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అధికార పక్ష సభ్యులు బిల్లులకు సంబంధిం చిన పత్రాలను ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన అలాగే కొనసాగడంతో చైర్మెన్ సభను గురువారానికి వాయిదా వేశారు. ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 48 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన నామినేటేడ్ రాజ్యసభ సభ్యురాలు మేరీ కోమ్, సిల్వర్ పతకం సాధించిన సోనియా చాహల్, రజత పతకం సాధించిన సిమ్రాన్జిత్ కౌర్, లవ్లీనాకు పార్లమెంట్ ఉభయ సభలూ అభినందనలు తెలిపాయి.