Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే..గులాబీ పూల జల్లులు...మోడీకి గజ వరమాలతో సత్కరించటం ఆ పార్టీలో ఆనవాయితీ. కానీ ఐదు రాష్ట్రాల్లో బీజేపీని అక్కడి ఓటర్లు తిరస్కరించిన విషయం విదితమే. స్వల్పవ్యవధిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీకి ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్షా హాజరైనా..వారి ముఖాల్లో వెలుగులు కనిపించలేదు. పార్టీ నేతలు మొదలుకుని ఎంపీల్లోనూ విషాద ఛాయలు కనిపించాయి. నవ్వులు, పువ్వులు పూయించాల్సిన బీజేపీకి ఇలా అయ్యిందేంటీ.. అనుకుంటున్నట్టుగా సమావేశం జరిగింది. చివరికి పార్లమెంట్లో ప్రతిపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశంపై చర్చించింది. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 46 బిల్లులను ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ యోచిస్తుండటంతో ఈ దిశగా కసరత్తును బీజేపీ ముమ్మరం చేసింది.