Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంకేలో చేరిన కీలక నేత
చెన్నై: అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం (ఎఎంఎంకే) అధ్యక్షుడు, టీటీవి అధినేత దినకరన్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక సభ్యుడు, దినకరన్కు విధేయుడిగా పేరున్న సెంథిల్ బాలాజీ.. ఎఎంఎంకేని వీడారు. స్టాలిన్ సమక్షం లో ఆయన డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి బాలాజీ మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బాలాజీ.. రెండు రోజుల క్రితమే స్టాలిన్తో చర్చలు జరిపినట్టు తమిళనాట వార్తలు గుప్పుమన్నాయి. దీనిని ఆయన ఖండించలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తరువాత దినకరన్ వర్గంలో చేరిన 18 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు.
బాలాజీ పార్టీని వీడడంతో దినకరన్కు మరో షాక్ తగిలింది. రెండు నెలల క్రితమే ఆ పార్టీ కీలక నాయకుడు నన్జీ సంపత్ కూడా ఎఎంఎంకేకు రాజీనామా చేశారు. కాగా, 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో, వారందరూ తిరిగి సొంతగూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో బాలాజీ వంటి కీలక నేత పార్టీని వీడడం దినకరన్కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.