Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: మత మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో అరెస్టైన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాకు ఊరట లభించింది. కేరళ హైకోర్టు ఆమెకు ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇస్తూ.. ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు చేయకూడదని అంతేగాక పంప పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్లకూడదంటూ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దుస్తులు ధరించి ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు గానూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు హిందూత్వ కార్యకర్తలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో, ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫాతిమాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 4న బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆమె పిటిషన్ను పటాన్మిట్టా జిల్లా మెజిస్ట్రేట్ తిరస్కరించారు.