Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముసాయిదా బిల్లును సిద్ధం చేసిన కేంద్ర సమాచార శాఖ
న్యూఢిల్లీ : దినపత్రికల్లో, మ్యాగజైన్లలో 'చెల్లింపు వార్తల్ని' అడ్డుకునేవిధంగా పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలన్న పార్లమెంటరీ ప్యానెల్ సూచనను మోడీ సర్కార్ పక్కకు పెట్టింది. దీని ప్రస్తావన లేకుండానే 'ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పిరియాడికల్స్'(పీఆర్బీపీ) ముసాయిదా బిల్లును కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. అయితే ఈ ముసాయిదా బిల్లు ప్రస్తుతం కేంద్ర మంత్రి రాజ్యవర్థన్సింగ్ రాథోర్ టేబుల్పై ఉంది. ఆయన దీనికి ఆమోదముద్ర వేశాక, కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్తుంది. ఈ విషయానికి సంబంధించి ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తా కథనం ఇలా ఉంది... కేంద్రం సిద్ధం చేసిన పీఆర్బీపీ ముసాయిదా బిల్లులో...దినపత్రికల, పుస్తకాల, ఇతర పత్రికల ధృవీకరణ, రిజిస్ట్రేషన్, సర్క్యులేషన్ ధృవీకరణ అనే విషయాలను పేర్కొన్నారు. వాటిల్లో వస్తున్న అంశాలకు సంబంధించిన నిబంధనలు, ప్రెస్ కౌన్సిల్ చట్టానికి సవరణ...అంశాలు ప్రస్తావించారు. చెల్లింపు వార్తల్ని అడ్డుకునేవిధంగా ముసాయిదా బిల్లులో ఎలాంటి అంశాల్నీ పొందుపర్చలేదు. ఎన్నికల ముందు చెల్లింపు వార్తల్ని అరికట్టడానికి ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాల్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతోంది. వాటిని అరికట్టడానికి విధివిధానాల్ని రూపొందించాలని 2015లో పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర సమాచార శాఖను కోరింది. ప్రెస్ కౌన్సిల్ను మరింత శక్తివంతం చేసేవిధంగా నిబంధనావళిని తీసుకురావాలని సూచించింది. ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర సమాచారశాఖ పీఆర్బీపీ ముసాయిదా బిల్లును తయారుచేసినట్టు తెలుస్తోంది.