Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరీలంకేశ్ హత్యలోనూ వారికి ప్రమేయం
ముంబయి: హేతువాది దభోల్కర్ హత్య కేసులో ముగ్గురు నిందితులు అమోల్ కాలే, రాజేశ్ బంజీరా, అమిత్ దేగ్వేకర్లకు పుణేలోని సెషన్స్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ చేస్తున్న సీబీఐ నిర్ణీత గడువులోగా చార్జిషీటు దాఖలు చేయడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. కాగా.. బెయిల్ లభించిన ముగ్గురు.. ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులోనూ నిందితులుగా ఉండటం గమనార్హం. 2013 ఆగస్టు 20న పుణేలో మార్నింగ్ వాక్ చేస్తున్న దభోల్కర్ను దుండగులు కాల్చి చంపారు. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన నివాసం వద్ద గౌరీలంకేశ్.. దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.