Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సిట్టింగులు సహా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలపై క్రిమినల్ కేసుల విచారణకు 18 రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు సీనియర్ అడ్వకేట్, అమికస్ క్యూరియా విజరు హన్స్రాజ్ తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 4 ఇచ్చిన ఆదేశాల మేరకు కేరళ, బీహార్లలోని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులపై పెండింగ్ క్రిమినల్ కేసులను విచారించేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఇతర 18 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మణిపూర్, మేఘలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజ స్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న కేసుల సత్వర విచారణకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.