Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికవ్యవస్థకు విఘాతమని అంచనా వేయలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని అంచనా వేయలేక పోయా మని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభకు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రభావాలపై అడిగిన ఒక ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి. రాధాకృష్ణన్ పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రధాని మోడీ నవంబరు 8, 2016న ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అప్పటికీ చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు ఆ రోజు అర్థరాత్రి నుంచి రద్దవు తాయని ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థలో నల్లధనం, నకిలీ కరెన్సీ ప్రభావం తగ్గుతుందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. రిజర్వు బ్యాంకు ఆగస్టులో ఇచ్చిన నివేదిక మేరకు నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న 99.3 శాతం
కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చింది. నల్లధనంగా దాచ బడిన సొమ్ము కూడా ప్రధాన ఆర్థిక వ్యవస్థలోకి చేరే అవకాశము న్నదని భావించారు. ఈ నిర్ణయంతో 2017 తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.7శాతానికి పడిపోయింది. దీంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్సభలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంకు వ్యతిరేకించిందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే నల్లధనం, నకిలీకరెన్సీలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం అంతగా వుండదని రిజర్వుబ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి తెలిపినట్టు సమాచారం.