Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటా 6 లక్షల శిశుమరణాలు
- బీహార్, యూపీలో ఇప్పటికీ 50లక్షల ప్రసూతి ఇండ్లల్లోనే..
న్యూఢిల్లీ: దేశంలో యేటా.. నివారించగలిగే ఆరోగ్య సమస్యలతో ఆరు లక్షల మంది(71శాతం) శిశువులు మర ణిస్తున్నారు. గర్భిణీ ఆస్పత్రిలో డెలివరీ అయ్యి, శిశువులకు సరైన సమయంలో తగిన వైద్యం అందితే వీరిని రక్షించు కోవచ్చని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రెన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యునిసెఫ్) విడుదల చేసిన సర్వైవ్ అండ్ త్రైవ్ నివే దిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2017లో 53 లక్షల మంది ఐదేండ్లలోపు పిల్లలు చనిపోయారని ఈ రిపోర్టు తెలి పింది. ఇందులో 25లక్షలు అప్పుడే పుట్టిన శిశువులని వివ రించింది. మనదేశంలో మరణిస్తున్న ఐదేండ్లలోపు చిన్నా రుల్లో 62శాతం మంది నెలలోపు శిశువులేనని తెలిపింది. ఆర్థిక సమస్యలు, అవగాహనారాహిత్యం, వైద్య సదుపా యాలలేమి వంటి కారణాల వల్ల గర్భిణిలు ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారని, శిశువులకూ సరైన సమయంలో తగిన వైద్యం అందడం లేదని అందువల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. బీహార్, ఉత్తరప్రదేశ్లలోనే 50 లక్షల గర్భిణిలు ఇండ్లల్లోనే ఏ నిపుణుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ అవుతున్నారని వివరించింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకువచ్చినా అవి క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయాయని తెలుస్తున్నది. అయితే గర్భిణిలకు ఎన్ని పథకాలనీ కాదు వారికి నాణ్యమైన వైద్యం అందివ్వాలని యునిసెఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మరణాలను నివారించేందుకు గర్భిణిలకు పౌష్టికాహారం, వారికి ముందస్తు వైద్య పరీక్షలు, వైద్యసదుపాయల సమక్షంలో ప్రసూతి జరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు.