Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోక్యం చేసుకోవడానికి కారణాల్లేవ్
- రాఫెల్ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు
- కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఒప్పందంలో జోక్యం చేసుకోబో మని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రాఫెల్ డీల్కు వ్యతిరేకంగా దాఖలైన 36 పిటిషన్లను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. దేశ భద్రత దృష్ట్యా ఒప్పందంలోని విమానాల ధరలను రహస్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయడింది. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నవేళ సుప్రీంకోర్టు తీర్పు మోడీ సర్కార్కు ఊరట కలిగించిందని చెప్పవచ్చు.
ఒప్పందం జరిగిన ప్రక్రియలో అనుమానించదగ్గదేమీ లేదని ధర్మాసనం తెలి పింది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలు అవసరమనీ, భారత వైమానిక దళంలోకి నాలుగు, ఐదో తరం యుద్ధవిమానాలను చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ కోర్టు అభిప్రాయప డింది. దేశ భద్రత దృష్ట్యా కొన్ని అంశాల్లో గోప్యత పాటిం చాల్సి వస్తోందనీ కోర్టు తెలిపింది. రాఫెల్ ఒప్పంద నిర్ణయ విధానం, ధరల వ్యవహారం, అంతర్జాతీయ ఒప్పందం వంటి అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదనీ కోర్టు తెలిపింది.
ఒక వ్యక్తి చెప్పిన మాటలు పట్టుకొని..
ఈఒప్పందం 2016 సెప్టెంబర్లో జరిగినప్పుడు ఎలాంటి అనుమానాలు రేకెత్తలేదనీ, కేవలం ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే వ్యాఖ్యలు చేసిన తర్వాతే దీనిపై వివాదం మొదలైందనీ కోర్టు పేర్కొంది. ఒక్క వ్యక్తి చేసిన వ్యాఖ్యల ఆధారంగా న్యాయవిచారణకు ఆదేశించలే మనీ కోర్టు తెలిపింది. అంతేగాక ఈఒప్పందంలో ప్రయివేటు సంస్థకు వాణిజ్య లబ్ధి చేకూరుతుందని చెప్పేలా సాక్ష్యాలేమీ లేవని న్యాయస్థానం తెలిపింది.
రాఫెల్ ఒప్పందంలో మోడీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్ప డిందంటూ గత కొంత కాలంగా కాంగ్రెస్ ఆరో పణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశిం చాలంటూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ఎంఎల్ శర్మ తదితరు లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈపిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 14న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరిం చింది.
కోర్టు తీర్పు పూర్తిగా తప్పు : ప్రశాంత్ భూషణ్
మొదట చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశార న్న దానిపై విచారణకు సుప్రీం పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని మాత్రమే మేము కోరాం. నా అభిప్రా యం ప్రకారం సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయం తప్పు. ఒప్పందం సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను పట్టించుకోలేదు. చట్టం ప్రకారం యుద్ధ విమానాల కొను గోలు కోసం డిమాండ్ చేస్తూ తొలుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నుంచి ప్రతిపాదన రావాలి. 126 యుద్ధ విమా నాలు కావాలని వైమానిక దళం కోరింది. ఈ ప్రతిపాదన ప్రకా రం, ఎలాంటి విమానాలు కొనాలి, ఎన్ని కొనాలన్న దాన్ని డిఫెన్స్ ఎక్యుజేషన్ కౌన్సిల్ పరిశీలిస్తుంది. కానీ పాత ఒప్పందాన్ని ఒక్కసారిగా రద్దుచేశారు. ప్రధాని మోడీ ఫ్రాన్స్లో వాలిపోయి 36యుద్ధ విమానాల ఒప్పందం చేసు కుంటూ సంతకాలు చేసేశారు. ఈ వ్యవహారంలో 20వేల కోట్ల మేర ఖజానాకు నష్టం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.