Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు బలి
- ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు,
- ఒక జవాను మృతి
జమ్మూ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓవైపు ఉగ్రవాదుల ఏరివేత, మరోవైపు నిరసనకారులపై కాల్పులు.. వెరసి 11 మంది చనిపోయారు. వీరిలో ముగ్గురు ఉగ్ర వాదులు, జవాను, ఏడుగురు అమాయక పౌరులున్నారు. దాదాపు 50 మందికిపైగా గాయలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంలో ముందు జాగ్రత్త చర్యగా పుల్వామా అంతటా ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా లోని సిర్నూ గ్రామంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం పోలీ సులకు అందింది. దీంతో సైన్యం శనివారం ఉదయం ఆ గ్రామానికి చేరు కొని కార్డన్ సెర్చ్, సోదాలు జరిపింది. ఈ క్రమంలో పోలీసులు, ఉగ్ర వాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే ఘటనలో ఓ జవాను కూడా ప్రాణా లు కోల్పోయారు. కాగా.. భద్రతా బలగాల కార్డన్ అండ్ సెర్చ్ను నిరస ిస్తూ ఘటనా స్థలిలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో నిరసనకారులపై భద్రతాదళాలు భాష్పవాయు గోశాలు, పెల్లెట్లు ప్రయోగించడంతో పాటు కాల్పులు కూడా జరిపాయి. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు చనిపోగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.