Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో 81 శాతం, రాజస్థాన్లో 79 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..
-4 ఛత్తీస్గఢ్లో 68 శాతం మంది సంపన్నులు
- మూడు రాష్ట్రాల్లో 164 మందిపై క్రిమినల్ కేసులు
భోపాల్ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీల్లో సిరిమంతులే రంగప్రవేశం చేయబోతున్నారు. ఈ మూడు రాష్ట్రాల నుంచి గెలిచిన 519 మంది ఎమ్మెల్యేల్లో 413 మంది(79.57 శాతం) ఆస్తులు రూ. కోటికి పైనే ఉన్నాయి. 164 మంది(31.59 శాతం) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. మధ్యప్రదేశ్లో కొత్తగా 230 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా.. వీరిలో 187 మంది(81 శాతం) మంది కోటీశ్వరులే కావడం గమనార్హం. బీజేపీ నుంచి అత్యధికంగా 91 మంది(పార్టీలో 84 శాతం), కాంగ్రెస్ నుంచి 90 మంది( పార్టీలో 79 శాతం), బీఎస్పీ, ఎస్పీ నుంచి ఒక్కరు చొప్పున, ఇండిపెండెంట్లలో నలుగురు తమ ఎన్నికల అఫిడవిట్లలో రూ.కోటికి పైగా ఆస్తులను చూపించారు. మధ్యప్రదేశ్లో మొత్తం ఎమ్మెల్యేల సరాసరి ఆస్తుల విలువ రూ.10.17 కోట్లు. 2013లో ఈ విలువ రూ.5.24 కోట్లు ఉండగా ఈసారి భారీ మొత్తంలో పెరగడం గమనార్హం. విజరురాఘవ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ నేత సత్యేంద్రపాఠక్ ఆస్తులు అత్యధికంగా రూ.226 కోట్లు ఉండగా.. తర్వాతి స్థానంలో రత్లాం ఎమ్మెల్యే చైతన్య కశ్యప్ రూ.204 కోట్ల సంపదను కలిగి ఉన్నాడు. ఎమ్మెల్యేలందరిలోకంటే అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్న నేతగా పాంఢానా ఎమ్మెల్యే రాం ఢంగోర్(రూ.50 వేలు మాత్రమే) నిలిచారు. ఇక మధ్యప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 94 మంది(41 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 47 మందిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై అఘాయిత్యాలు, కిడ్నాప్ లాంటి తీవ్ర నేరపూరిత కేసులున్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు తమపై హత్యాయత్నం కేసులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది(56) ఉన్నారు. రాజస్థాన్లో 199 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది(79 శాతం) మంది కోటీశ్వరులు న్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 82 మంది ఎమ్మెల్యేలుండగా.. బీజేపీ నుంచి 58 మంది బీఎస్పీ నుంచి ఐదుగురు ఉన్నారు. కాగా..ఎమ్మెల్యేలందరి సరాసరి ఆస్తుల విలువ రూ.7.39 కోట్లు(2013లో రూ.5.81 కోట్లు)గా ఉన్నది. ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. అంతేకాక.. 46 ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 28 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులున్న వారిలో కాంగ్రెస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి 12 మంది, బీఎస్పీ నుంచి ఇద్దరు ఉన్నారు. 59 మంది ఎమ్మెల్యేలు ఐదు నుంచి 12 వరకు, 129 మంది డిగ్రీ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు అక్షరాస్యులం మాత్రమేనని పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లో నలుగురిలో
ముగ్గురు కోటీశ్వరులు
ఛత్తీస్గఢ్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో నలుగురిలో ముగ్గురు కోటీశ్వరులు కాగా.. పావు వంతు మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 68 మంది(76 శాతం) మంది కోటీశ్వరులైన ఎమ్మెల్యేల్లో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 48 మంది ఉన్నారు. బీజేపీ నుంచి 14 మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్(జేసీసీ) నుంచి ఐదుగురు సంపన్నులు న్నారు. ఎమ్మెల్యేల సరాసరి ఆస్తుల విలువ 2013లో రూ.8.8 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.11.63 కోట్లకు చేరుకున్నది. రాష్ట్రంలోని 90 మంది ఎమ్మెల్యేల్లో 24 మందిపై క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 13 మందిపై తీవ్ర నేరారోప ణలున్నాయి. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా 19 మంది, బీజేపీ నుంచి ముగ్గురు, జేసీసీ నుంచి ఇద్దరిపై క్రిమినల్ కేసులున్నాయి.