Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి రాజీనామాను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శనివారం ఆమోదించారు. తెలంగా ణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో శుక్రవారం స్పీకర్ను ప్రత్యేకంగా కలిసి తన రాజీనామాను అందజేశారు. రాజీనామా స్పీకర్ ఫార్మాట్లో ఉండటంతో ఆమె ఆమోదించినట్టు ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికలు మరో ఐదు నెలలు మాత్రమే ఉండటం ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పీకర్ కార్యాలయవర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎన్నికల వరకు మల్కాజ్గిరి ఎంపీ స్థానం ఖాళీగానే ఉండనున్నది.