Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదిలో 97 హర్తాళ్లు, బీజేపీవే అధికం
- ప్రతిసారీ 200 కోట్ల చొప్పున నష్టం
తిరువనంతపురం:
ప్రకృతి రమణీయ మల బారు తీరం కేరళలో పర్యా టక రంగానికి 'హర్తాళ్' ఎఫెక్ట్ పడింది. ఈఏడాది రాష్ట్రంలోని వివిధ రాజకీ య పార్టీలు ఇప్పటి వరకు మొత్తం 97హర్తాళ్లు చేశాయి. గతేడాది రాష్ట్రంలో మొత్తం 120హర్తాళ్లు జరిగాయి. దీంతో రెండేండ్ల వ్యవధి లోనే కేరళలో 200హర్తాళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ రెండేం డ్లలో జరిగిన హర్తాళ్లను చూసుకుంటే అధికంగా బీజేపీ దాని అనుబం ధ సంస్థలకు సంబంధించినవే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ చిన్న గొ డవ అయినా దానిని మతకోణంతో రెచ్చగొట్టి హర్తాళ్లు, గొడవలు సృ ష్టించడం, దానిని తన రాజకీయ ఎదుగుదలకు బీజేపీ వాడుకోవడం తెలిసిందే. ఇందుకు 'శబరిమల' వివాదమే ఉదాహరణగా చెప్పు కోవ చ్చు. పార్టీల పరంగా చూసుకుంటే.. ఈ ఏడాది బీజేపీ దాని అనుబం ధ సంస్థలు మొత్తం 31, యూడీఎఫ్ 23 హర్తాళ్లు నిర్వహించాయి. గతేడాది ఈ సంఖ్య వరుసగా 47, 32గా ఉన్నాయి. హర్తాళ్ జరిగిన ప్రతిసారీ కేరళ ఆర్థిక వ్యవస్థక దన్నుగా నిలిచే పర్యాటక రంగానికి రూ. 200 కోట్ల మేర నష్టం ఏర్పడుతోంది. దీనితో కేరళకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల పైనే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఇది పెను ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు చూసుకుంటే ఒక గురువారం రోజే కేరళకు ముఖ్యంగా యూకే, జర్మనీ నుంచి దాదాపు 2,500 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. అయితే ఆ రోజు బీజేపీ చేపట్టిన బంద్ కారణంగా సుమారు 50వేలమంది దాకా దేశ, విదేశీ పర్యాటకులు తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. పరోక్షంగా ఇది రాష్ట్ర పర్యాటక, వాణిజ్య రంగంపై ప్రభావం పడింది.