Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనపై టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి ఆగ్రహం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లులో కేంద్రం పేర్కొన్న హామీలపై లోక్సభ, రాజ్యసభల్లో పోరాడుతామని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ పాలనలో దేశం విపత్తులోకి కూరుకుపోయిందని చెప్పారు. సోమవారం పార్లమెంట్ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం, ఉక్కు కర్మగారం, ఎయిమ్స్కు నిధులు వంటి అంశాలపై ఈ సమా వేశాల్లో కేంద్రాన్ని నిలదీయనున్నట్టు చెప్పారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై న్యా యం చేయాలని తమ నాయకుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినట్టు గుర్తు చేశారు. అయినా కేంద్ర ప్రభు త్వం స్పందించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మోడీ సర్కారు ఒక్క పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయలేదని ఆయన విమర్శిం చారు. కరీంనగర్ ఎంపీ వినోద్ మాట్లా డుతూ బీజేపీ మోసపూరిత విధానాలను సభలో ఎండగట్టనున్నట్టు వివరించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకువస్తా మన్నారు.
ఎంపీ పదవికి బాల్క సుమన్ రాజీనామా
లోక్సభ సభ్యత్వానికి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి రాజీనామా లేఖను సమర్పిం చారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.