Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయ్యప్ప ధర్మసేన నాయకుడు రాహుల్ అరెస్టు
తిరువనంతపురం: బెయిల్ షరతును ఉల్లంఘించినందుకు అయ్యప్ప ధర్మ సేన నాయకుడు రాహుల్ ఈశ్వర్ను కేరళ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ విషయంలో ఈనెల 15 పథనంతిట్ట జిల్లాలోని న్యాయస్థానం ఆయనకు బెయిలు రద్దు చేసిన విషయం తెలిసిందే. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను ముందుండి నడిపించినవారిలో ఆయన ఒకరు. ఈ ఏడాది అక్టోబరు 17న అయ్యప్ప పూజ కోసం ఆలయం తెరిచినప్పుడు శబరిమల వద్ద జరిగిన అల్లర్లలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. ప్రతిశనివారం పథనంతిట్ట పోలీసు స్టేషన్కు వచ్చి రిపోర్టు చేయాల్సిందిగా కోర్టు షరతు విధించింది. కానీ, ఈనెల 8న ఆయన పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయలేదు. దీంతో ఆయన బెయిలు రద్దు చేసిన న్యాయస్థానం.. రాహుల్ను మళ్లీ అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి పాలక్కడ్కు వచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పథనంతిట్టలోని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు.