Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెథారు తుపాను ప్రభావంతో కోస్తాలో సోమవారం విస్తారంగా కురిసిన వర్షానికి ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ మూడు గేట్లను ఎత్తి, కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి దాదాపు మూడు వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతున్నట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు. దీంతో మూడు గేట్లను ఎత్తి 2,175 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగుల మేర నీటి నిల్వను పరిగణలోకి తీసుకుని అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. అయితే సోమవారం రాత్రికి ఎగువ నుంచి వచ్చే ప్రవాహం క్రమేణా తగ్గిందని తెలిపారు.