Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాంబే హైకోర్టును కోరిన పౌరహక్కుల నేత ఆనంద్ తేల్తుంబ్డే
ముంబయి : భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో తనను నిందితుడిగా చేర్చుతూ పూణె పోలీసులు దాఖలుచేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిందిగా పౌరహక్కుల నేత ఆనంద్ తేల్తుంబ్డే బాంబే హైకోర్టును కోరారు. జస్టిస్ బీపీ.ధర్మాధికారి, జస్టిస్ సారాంగ్ కోత్వాల్ ధర్మాసనం ఈ కేసు విచారణ జరుపుతోంది. ఆనంద్ తేల్తుంబ్డే ఎక్కడా కూడా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆధారాలు లేవని, అలాగే అతని సామాజిక, ఆర్థిక సంబంధాల్లోనూ అనుమానించదగిందేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో తనపై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాల్సిందిగా హైకోర్టును ఆనంద్ తేల్తుంబ్డే కోరారు. గతేడాది డిసెంబరు 30, 31న అల్లర్లు జరిగిన ప్రాంతానికి సమీపంలోగానీ, పూణెలోగానీ ఆనంద్ తేల్తుంబ్డే లేరని ఆయన తరఫు న్యాయవాది మిహీర్ దేశారు న్యాయస్థానానికి తెలియజేశారు.