Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుండి బయటపడేసేంత వరకూ తాము ప్రధాని మోడీని నిద్రపోనివ్వ బోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్ చేరుకున్న వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో తమ పార్టీ ప్రభుత్వాలు అధికారం చేపట్టిన ఆరు గంటల్లోనే వ్యవసాయ రుణా లను మాఫీ చేశాయని ఆయన గుర్తు చేశారు. రాజస్థాన్లో ప్రభుత్వం కూడా త్వరలోనే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తుందని ఆయన చెప్పారు. 'మా పార్టీ ప్రభుత్వాలు అధికారం చేపట్టిన వెంటనే వాగ్దానాల అమ లును ప్రారంభించాయి చూశారా?' అని ఆయన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన విజయం రైతుల విజయమని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ అధికారం చేపట్టి నాలుగున్నరేండ్లు గడిచినా పేద రైతుల కోసం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ త్వరలోనే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాయని, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై తాము ఇందుకు వత్తిడి తెస్తామని చెప్పారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేసేంత వరకూ తాము మోడీని నిద్రపోనివ్వబోమని ఆయన పునరుద్ఘాటించారు.