Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీసీ డిమాండ్కు బీజేపీ సర్కార్ నో
- ఉభయ సభల్లో నిరసనల హౌరు
- మిన్నంటుతున్న ఎంపీల ఆందోళనలు
నవ తెలంగాణ - న్యూ ఢిల్లీ బ్యూరో
రాఫెల్పై ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీల నిరసనలు హౌరెత్తాయి. బీజేపీ ప్రభుత్వం జేపీసీకి ఒప్పుకోకపోవడంతో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగు తూనే ఉన్నాయి. పార్లమెంటును వాయి దాల పర్వాలతో ముగించక తప్పటంలేదు. మంగళవారం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే రాఫెల్ అంశంపై జేపీసీ నియమిం చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు
ప్రదర్శించారు. సీపీఐ(ఎం) ఎంపీలు తమ స్థానాల్లో నిలుచొని నిరసన చేపట్టారు. ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రిపై తాము ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసుపై స్పీకర్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కాగా, బీజేపీ ఎంపీలు మాత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్లకార్డులతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అన్నాడీఎంకే, డీఎంకే ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు. కావేరి నదిపై డ్యాంలు నిర్మించొద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఏపీకి ప్రత్యేక హౌదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోడియం వద్ద ఆందోళన చేపట్టి, నినాదాలు చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే విపక్షాల ఆందోళన మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఆందోళన చేస్తున్న ఎంపీలను తమ స్థానాల్లోకి వెళ్లాల ని స్పీకర్ పదేపదే కోరారు. అయితే వారు ఎంతకూ శాంతించకపో వడంతో సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైనప్పటికీ సభలో అదే పరిస్థితి పునరా వ తమైంది. సభలో ఎంపీల తీరుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రజలకు అవసరమైన చర్చ చేయాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అయి నా సభ్యులు వినకపోవడంతో, ఆందోళనల నడుమే సభను నిర్వహిం చారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు స్పీకర్ సుమి త్రామహాజన్ అనుమతించారు. ఆయన మాట్లాడుతూ అవిశ్వాస తీర్మా న సమయంలోనే రాఫెల్ అంశంపై చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాఫెల్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై తాము చర్చకు సిద్ధమని, జేపీసీ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గులాంనబీఆజాద్ మాట్లాడారు. రాఫెల్ అంశంపై సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎంపీ లు సభకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దాంతో సభకార్యక్రమాలు తొలుత రెండింటికి ఆ తర్వాత బుధవారా నికి వాయిదా పడ్డాయి.