Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పదవికి నేనే కరెక్ట్ : యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: దేశ ప్రధాన మంత్రి పదవిపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నాయకుడు యశ్వంత్సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని రేసులో తానున్నట్టు ఆయన తెలిపారు. ఆ పదవికి తానే కరెక్ట్ అని అన్నారు. ఉద్యోగాల సృష్టి, రోడ్ల నిర్మాణాలు, టౌన్షిప్, పరిశ్రమల ఏర్పాటు వంటివి జరగకపోవడమే దేశంలో సమస్యగా పరిణమించిందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో శ్రీరాం కాలేజీ నిర్వహించిన ఎకనమిక్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేండ్లలో భారత ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టాలని తెలిపారు. 'పనిచేయడం మొదలుపెడితే ఏడాదికి రెండు, మూడు కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు. కానీ మనం ఆ విధంగా చేయటం లేదు. ఇదే పెద్ద సమస్యగా తయారైంది. కాబట్టి ఈ విధంగా పని చేసేవారు ఎవరున్నారో మనం గుర్తించాలి' అని సిన్హా అన్నారు. ఆ విధంగా పనిచేసేవారు ఎవరున్నారన్న ప్రశ్నకు సమాధానంగా.. 'ఎవరూ లేరు'అని మొదట సమాధానమిచ్చిన ఆయన.. ఆ తర్వాత ప్రధాని పదవికి తానే సరైన వ్యక్తినని తెలిపారు. మోడీ స్థానంలో ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రస్తుత కేంద్ర మంత్రి గడ్కరీ పేరుపై ఆయన పెదవి విరిచారు. మోడీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమిలో అందరూ ప్రధాని అభ్యర్థులేనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వాజ్పేయి ప్రభుత్వంలో రెండుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. గతేడాది ఏప్రిల్లో బీజేపీని వీడిన విషయం తెలిసిందే.