Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఖాళీకుండలు, నల్ల బెలూన్లు, జెండాలతో నిరసనలు
- హెలికాప్టర్లో ప్రధానికి కనిపించిన ప్రత్యేక హోదా జ్వాలలు
- వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్ విడిగా ఆందోళనలు
- బాబు 'యూటర్న్' ఎందుకు తీసుకున్నారు? : మోడీ
గుంటూరు : అసోంలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు మోడీకి ఎదురైతే...ఏపీలో ప్రత్యేక హౌదా కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నిరసనలతో ప్రధాని ఉక్కిరిబిక్కిరయ్యారు. గతనెలలోనే ఏపీలో పర్యటించాలని మోడీ అనుకున్నా భద్రతకారణాలతో వెనక్కి తగ్గారు. సార్వత్రిక ఎన్నికలు వస్తుండటంతో.. ఎలాగైనా ఏపీలోకి వెళ్లాల్సిందేనన్నట్టుగా ప్రధాని గుంటూరు నుంచే పలు అభివృద్దికార్యక్రమాలను ప్రారంభించటానికి వచ్చారు. అయితే విజయవాడ నుంచి గుంటూరుకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన ప్రధాని ప్రత్యేక హౌదా ఉద్యమ జ్వాలలను కండ్లారా చూశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాకకు వ్యతిరేకంగా ఆదివారం ఏపీ రాష్ట్ర మంతా అట్టుడికింది. పల్లె పట్టణం అనే తేడాలేకుండా 'మోడీ గో బ్యాక్' అన్న నినాదం మారుమోగింది. వామపక్షాలు, టీడీపీ, కాంగ్రె స్లు విడివిడిగా ఇచ్చిన పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా..ఖాళీ కుండల ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనాలు, నల్లజెండాల ఎగరవే తల దృశ్యాల కనిపించాయి. కృష్ణా నదిలోనూ నిలబడి నిరసన ప్రదర్శ నలు కొనసాగించారు. ప్రధాని ప్రత్యక్షంగా కాలు పెట్టిన విజయ వాడ, గుంటూరు నగరాల్లో భారీ స్థాయిలో నిరసనలు చోటుచేసుకు న్నాయి. గన్నవరం విమానాశ్రయం లో ప్రధాని అడుగుపెట్టగానే 'మోడీ గో బ్యాక్' అని రాసిఉన్న నల్లబెలూన్లు నింగికెగిశాయి. ప్రత్యేక హెలి కాప్టర్లో ఆయన గుంటూరులో దిగినప్పుడు కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలోనే గుంటూరు నగరంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసనల మధ్యే గుంటూరులో జరిగిన సభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, దానిని సరిదిద్దడం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రత్యేకహాదా విషయంలో చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశ్పించారు. గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఆదివారం బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య సభలో మోడీ ప్రసంగించారు. సభకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లకీëనారాయణ అధ్యక్షత వహించారు. మోడీ మాట్లాడుతూ హోదాకు సమానంగా తాము ప్రత్యేక ప్యాకేజిని ప్రకటంచామని చెప్పారు. దీనిని చంద్రబాబు స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 'బాబు ప్యాకేజిని స్వాగతించలేదా? మా ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీని సన్మానించలేదా? కేంద్రాన్ని అభినందిస్తూ శాసనసభలో తీర్మానం చేయలేదా?' అని ప్రశ్నించారు. 'ఇన్ని చేసిన చంద్రబాబు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు' అని ప్రశ్నించారు. 'బాబుకు ఓటమి భయం పట్టుకున్నది. అందుకే కాంగ్రెస్ వళ్లో కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అంటే, బాబు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారు' అని అన్నారు.
లోకేశ్బాబు తండ్రిగా చంద్రబాబును పేర్కొన్న ఆయన ఇద్దరు కలిసి కుటుంబ సంపదను పెంచుకోవడానికే ప్రాధ్యానత ఇస్తున్నారన్నారు. ' రాష్ట్రాభివృద్ధిని విస్మరించి ఆయన కొడుకు, ఆయన కుటుంబ సంపద పెంచుకోవడం కోసమే బిజీ అయిపోయారు. చంద్రబాబు లాగా వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం నాకు చేతకాదు.' అని అన్పానరు. పాలకులు ప్రజల సంపద పెంచాలేగాని సొంత సంపద పెంచుకోకూడదని, కాని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తన ఆస్తులు పెంచుకుని తన కుమారుడిని అందలం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు కేటాయించామని, కాపలాదారుడిగా తాను లెక్కలడిగితే అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని, పారిపోతున్నారని విమర్శించారు. అమరావతి, పోలవరం నిర్మాణంలో తాము ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే చెప్పలేదన్నారు. కేంద్ర పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని టీడీపీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారని, తాము ఈరోజు నిర్వహించిన సభకయ్యే ఖర్చు తమ పార్టీ కార్యకర్తలే పెట్టుకున్నారని తెలిపారు. సోమవారం చంద్రబాబు నిర్వహించే దీక్ష ప్రజలు ఇచ్చిన ప్రభుత్వ నిధుల నుంచి భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంస్కారవంతులని, చంద్రబాబు వాడుతున్న బాష తెలుగు ప్రజల సంస్కృతిని కించపరిచేలా ఉందని విమర్శించారు. తన పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ వాళ్లు ఎగురవేసిన నల్లబెలూన్లు తమకు దిష్టి తీసినట్టుగా భావిస్తున్నానన్నారు. రాజకీయాల్లో తాను సీనియర్ని చెప్పుకుంటున్న చంద్రబాబు తరచూ కొత్త కూటముల కూర్పులో, ఎన్నికల్లో ఓడిపోవడంలో 'సీనియర్'గా అభివర్ణించారు. ఆంధ్రా ప్రజల కలల్ని వంచించడంలో, ఎన్నికల్లో ఓడిపోవడంలో చంద్రబాబు సీనియర్ అని, తాను ఆ విషయంలో పోటీపడలేనని ఎద్దేవా చేశారు. 'మామ ఎన్టిఆర్కు వెన్నుపోటు పొడిచారు' అని అన్నారు. తిరుపతిలో ఐఐటీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, మంగళగిరిలో ఎయిమ్స్తో పాటు పది విద్యా, వైద్య సంస్థలను రాష్ట్రానికి కేటాయించామని చెప్పారు. కేంద్ర నిధులతో విశాఖ-చెన్నరు పారిశ్రామిక కారిడార్ పనులు చేపట్టామని, మూడు విమానాశ్రయాలను విస్తరించామని, మరో మూడింటిని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం కలిగించే పలు ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
ఎపిలో చేపట్టిన 8 పెద్ద ప్రాజెక్టుల్లో ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు గో బ్యాక్ అన్నట్లుగా తనను గో బ్యాక్ అనడం మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రధాని పీఠంపై కూర్చోమని ఆకాంక్షిస్తున్నట్లుగా ఉందని చెప్పారు.
పెట్రో ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని
అంతకుముందు గుంటూరులో ప్రధాని నరేంద్ర మోదీ మూడు పెట్రోలియం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కృష్ణపట్నంలో నిర్మించనున్న పెట్రో కోస్టల్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు కేజీ బేసిన్లోని ఒఎన్జీసీ వశిష్ట ప్రాజెక్టు గ్యాస్ నిల్వ కేంద్రం, విశాఖపట్నంలోని చమురు నిల్వ సంస్థలను జాతికి అంకితం చేశారు. ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహం, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, ఎంపిలు జివిఎల్ నరసింహారావు,. గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పి.మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్గం నుంచ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ప్రధాని పర్యటనకు మొత్తం మంత్రి వర్గం దూరంగా ఉండటం ఇదే మొదటిసారని చెబుతున్నారు.
గన్నవరంలో..
నరేంద్ర మోడీకి గన్నవరం విమానాశ్రయంలో అధికార లాంఛనాలతో స్వాగతం లభించింది. గుంటూరులో జరిగే బీజేపీ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో ఆయన ఇక్కడకు వచ్చారు. మోడీకి స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానిని కలిసే జాబితాలో కన్నా పేరు లేకపోవడంతో భద్రతా అధికారులు ఆయనను లోపలకు అనుమతించలేదు. దీంతో ఆయన తిరిగి కారులో గుంటూరు వెళ్లిపోయారు.