Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్ బెటరనటానికే మోడీ సర్కార్ పాట్లు
పుణే : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) పై విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో హెచ్ఏఎల్ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల బెంగళూరులో మిరేజ్ 2000 శిక్షణ విమానం కూలిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ హెచ్ఏఎల్ ఆధునికీకరించిన ఈ విమానం విన్యాసానికి వెళ్ళినపుడు కూలిపోయిందని, దాని విడిభాగాలు రన్వేపై చెల్లాచెదురయ్యాయని తెలిపారు.
''చూశారు కదా హెచ్ఏఎల్ని. ఈ ప్రాజెక్టు మూడున్నరేండ్లు ఆలస్యమైంది. ఆధునికీకరణ జరిగిన విమానాల్లో ఇది కేవలం ఎనిమిదో విమానం మాత్రమే. ఇదేనా సామర్థ్యం? హెచ్ఏఎల్కి పని చెప్పడం లేదంటారు'' అని జనరల్ సింగ్ చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం సాయంతో నడుస్తున్న హెచ్ఏఎల్ కన్నా..అనిల్అంబానీకి అప్పగించిన రాఫెల్ కాంట్రాక్టు బెటరనేలా చెప్పటానికి మోడీ సర్కారు పడరానిపాట్లు పడుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.