Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: నిర్భయపై లైంగికదాడి కేసులో దోషులుగా తేలిన నలుగురినీ వీలైనంత త్వరగా ఉరి తీయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు పటి యాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబరు 16, 2012న స్నేహితుడితో కలిసి బస్సులో వెళ్తున్న నిర్భయపై ఆరుగురు దుండగులు అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసులో దోషులుగా తేలిన ముఖేశ్, పవన్ గుప్తా, వినరు శర్మ, అక్షరుకుమార్ సింగ్, రాంసింగ్, ఓ బాలుడికి కోర్టు శిక్షలు విధించింది. ఐదుగురికి మరణ శిక్ష విధించిన కోర్టు, బాలుడికి మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం విదితమే. శిక్షాకాలం పూర్తి కావడంతో బాలుడు జైలు నుంచి విడుదల కాగా, రాంసింగ్ జైల్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిగతా వారు జైల్లో ఉన్నారు. కోర్టు శిక్ష విధించి నెలలు గడుస్తున్నా దోషులకు శిక్ష విధించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం మార్చి రెండో తేదీన విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.ొ పిటిషన్ దాఖలు చేసిన నిర్భయ తల్లిదండ్రులు.