Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ వల్సద్లో వేదికపై ముద్దాడిన మహిళ
గాంధీనగర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీ ప్రచారం కోసం గుజరాత్ చేరుకున్నారు. రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ఆయన వద్దకు వచ్చిన ఓ మహిళ ఆయనను ముద్దాడింది. ఇందుకు సంబంధించిన ద శ్యం హల్చల్ చేస్తున్నది. ఇక్కడి వల్సద్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్ వేదికపై ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నారు. ఆయనను కలవడానికి కొందరు మహిళలు వేదికపై వచ్చారు. వారితో మాట్లాడడానికి ఆయన లేచి నిలబడ్డారు. ఇంతలో ఆయన వద్దకు వేగంగా వచ్చిన మధ్యవయస్కురాలైన ఓ మహిళ కాంగ్రెస్ అధ్య క్షుడి ఎడమ చెంపపై ముద్దుపెట్టింది. ఆ సమయంలో రాహుల్ చిరునవ్వులు చిందించారు. వేదికపైకి వచ్చిన మహిళలంతా కలిసి ఆయనకు పూలదండలు వేసి, కాసేపు మాట్లాడి వెళ్లారు. ఈ దశ్యాన్ని చూసిన అక్కడి వారంతా చప్పట్లు కొడితే..రాహుల్ మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు ఫోటోల్లో కనిపిస్తున్నది.