Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారం లేదు: ప్రధాన మంత్రి కార్యాలయం
- దాదాపు వందమంది చనిపోయినట్టు అప్పట్లో మీడియాలో వార్తలు
న్యూఢిల్లీ: దేశంలో పెద్దనోట్ల రద్దు కారణంగా సంభవించిన మరణాలపై తమవద్ద ఎలాంటి సమాచారమూ లేదని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించటం చర్చనీయాంశంగా మా రింది. దేశంలో నల్లధనాన్ని కట్టడి చేస్తామని చెప్పి ప్రధాని మోడీ 2016, నవంబరు8న తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరి క్యూలైన్లలో నిలుచున్నారు. ఈ సందర్భంగా ఒక నెల రోజుల వ్యవధిలోనే(నవంబర్8-డిసెంబర్ 8 మధ్య) దాదాపు 100 మంది మరణించినట్టు అప్పట్లో మీడియాలో, పత్రికల్లో ప్రధానంగా వార్తలూ వచ్చాయి. దీనిపై ప్రధాన పార్టీలతో సహా విపక్షాలన్నీ పార్లమెంటులో అధికార మోడీ సర్కార్ను అప్పట్లో నిలదీశాయి. కానీ, నోట్ల రద్దు కారణంగా సంభవించిన మరణాలపై తమ వద్ద ఇప్పటివరకూ ఎలాంటి సమాచారమూ లేదని పీఎంఓ తెలిపింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ పీఎంఓలోని సీపీఐఓ.. కేంద్ర సమాచారం కమిషన్(సీఐసీ) ముందు వెల్లడించడం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఒక్కరు మాత్రమే చనిపోయారని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ గత డిసెంబర్ 18న రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నోట్ల రద్దు మరణాలపై కేంద్ర హౌం మంత్రిత్వశాఖ తలచుకుంటే ఆ మరణాల వివరాలు వచ్చి ఉండేవి. ప్రతిస్టేషన్ వారీగా బ్యాంకులు, ఎటీఏం బందోబస్తు నిర్వహించిన పోలీసుల వద్ద క్యూలైన్లలో చనిపోయినవారి పేర్లూ ఉన్నాయి. ఈ వివరాలు మీడియాలోనూ వచ్చాయి. అయితే దీనిపై పీఎంఓ సమగ్ర వివరాలు పొందే వీలున్నప్పటికీ ఆ విధంగా చేయకపోగా.. ఆ సమాచారం లేదనడం గమనార్హం.
నోట్ల రద్దుకు సంబంధించిన మరణాలు, వాటి జాబితాపై సమాచారాన్ని కోరుతూ నీరజ్శర్మ అనే వ్యక్తి .. 2017, అక్టోబర్28 పీఎంఓకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని 30రోజుల్లో అందించాల్సినప్పటికీ పీఎంవో సమాచా ర కమిషనర్(సీపీఐఓ) ప్రవీణ్ కుమార్ లైట్ తీసుకు న్నారు. రెండు నెలల అనంతరం స్పందిస్తూ నీరజ్కు లేఖను పంపారు. అయితే ఈ విషయంలో సీపీఐ ఓకు జరిమానా విధించాలని కోరుతూ నీరజ్ శర్మ.. కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ని ఆశ్రయించారు.
సీఐసీ సుధీర్ భార్గవ విచారణ సందర్భంగా.. సమాచారం అందించడంలో ఆలస్యమైనందుకు నీరజ్ శర్మకు, సీఐసీకి ప్రవీణ్ కుమార్ క్షమాపణలు తెలిపారు. అయితే ఆర్టీఐలోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం నీరజ్ కోరిన సమాచారం పీఎంఓ అందించలేదని ప్రవీణ్ సీఐసీకి తెలిపారు. అలాగే నోట్ల రద్దు కారణంగా సంభవించిన మరణాలపై తమ వద్ద సమాచారం లేదని ప్రవీణ్కుమార్ అన్నారు. కాగా, ప్రవీణ్పై ఎలాంటి జరిమానా విధించనప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సుధీర్ భార్గవ ఆయనకు సూచించారు.