Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి 'తనసాహీ హఠావో, లోక్తంత్ర బచావో' (నియంతృత్వాన్ని ఓడించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి) అనే నినాదంతో జంతర్మంతర్ వద్ద గురువారం ర్యాలీని నిర్వహించడంతో బీజేపీ ఖంగుతింది. ప్రతికూల ఆలోచనలు ఉన్న కూటమి సభ నిర్వహించినందున ఆ ప్రాంతాన్ని గంగా జలంతో శుద్ధి చేస్తున్నామని బీజేపీ 'డ్రామా'కు తెరలేపింది. నాలుగేళ్ల కాలంగా రాష్ట్ర ప్రజలను అరవింద్ కేజ్రీవాల్ మోసం చేస్తున్నారని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆప్ను ఓడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేందంపై ఆప్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని అన్నారు. జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల్లో కేంద్ర మంత్రి విజరు గోయల్, బీజేపీ ఎంపి రమేష్ భిదురీ, పర్వేశ్ వర్మ, ఉదిత్ రాజా, తదితరులు పాల్గొన్నారు.