Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వైఖరికి నిరసనగా సీఎం వి నారాయణస్వామి చేపట్టిన ధర్నా శుక్రవారం మూడో రోజుకు చేరింది. సీఎం నారాయణస్వామి, ఆయన క్యాబినెట్ మంత్రులు, కాంగ్రెస్, డీఎంకే చట్టసభ్యులూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారిక నివాసం బయట బైటాయించారు. అక్కడ పెద్దమొత్తంలో భద్రతా బలగాలు మోహరించాయి. 21న సీఎంతో సమావేశానికి బేడీ పిలుపునిచ్చారు. అయితే సమావేశం అనవసరమని, ఎల్జీ ముందుకు తాము పంపిన ప్రతిపాదనలన్నింటిపైనా ఆమెకు అవగాహన ఉందని నారాయణస్వామి అన్నారు. పుదుచ్చేరిలో ద్విచక్రవాహనదారులందరూ హెల్మెట్ ధారణను తప్పనిసరి చేస్తూ ఎల్జీ జారీ చేసిన ఆదేశాలతో సీఎం విబేధిస్తూ.. ఈ ఆదేశాలను దశలవారీగా అమలు చేయాలని కోరిన విషయం తెలిసిందే. కాగా, నారాయణ స్వామి క్యాబినెట్ పంపిన 39 ప్రతిపాదనలపై ఎల్జీ ఆమోదించాల్సి ఉంది. ద్విచక్ర వాహనాలకు హెల్మెట్ విషయమై జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎల్జీ లేఖ రాసిన ఎల్జీ గురువారం రాత్రి ఢిల్లీకి బయల్దేరారు. కాగా, పుదుచ్చేరిలో నెలకొన్న పరిస్థితులను చక్కబెట్టేందుకు మధ్యంతర అడ్మినిస్ట్రేటర్ను నియమించాల్సిందిగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ వి వైథిలింగం లేఖ రాశారు.